టీఎస్‌ ఐసెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల

-

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్‌ఐసెట్‌- 2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. కాకతీయ యూనివర్సిటీ వైఎస్‌ ఛాన్స్‌లర్‌, టీఎస్‌ ఐసెట్‌-24 చైర్మన్‌ ప్రొఫెసర్‌ తాటికొండ రమేశ్‌ మంగళవారం విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550, ఇతరులు రూ.750 రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 అపరాధ రుసుముతో మే 17 వరకు, రూ.500 అపరాధ రుసుముతో మే 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.

 

దరఖాస్తులో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి 20 తేదీ మధ్య మార్పులు చేసుకోవచ్చు. మే 28వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష జూన్‌ 4వ తేదీన 2 సెషన్లు, 5వ తేదీన ఒక సెషన్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 15న ప్రాథమిక కీ, జూన్‌ 16 నుంచి 19 మధ్య అభ్యంతరాల స్వీకరణ, జూన్‌ 28వ తేదీన ఫైనల్‌ కీ, ఫలితాలను జూన్‌ 28వ తేదీన విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news