‘మే’లో పరీక్షలకు TSPSC కసరత్తు.. వారం రోజుల్లో తేదీలు వెల్లడి

-

టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం వల్ల నాలుగు పరీక్షలు రద్దయ్యాయి. రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే ఈ పరీక్షలపై త్వరలోనే టీఎస్పీఎస్సీ ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో పరీక్షల తేదీలను ప్రకటించాలని భావిస్తోందట. మే నెలలో ఆయా పరీక్షలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మే నెలలో పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.  వీలైనన్ని ఎక్కువ పరీక్షలు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం రోజున టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బీ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో కమిషన్‌ భేటీ జరిగింది. ఇప్పటికే జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

మిగిలిన పరీక్షల తేదీల ప్రకటన, నిర్వహణ, సీబీటీ విధానం తదితర అంశాల గురించి ఈ భేటీలో చర్చించింది. సీబీటీ వి ధానంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చైర్మన్‌ అధికారులకు సూచించగా.. ఇప్పటికిప్పుడు అంటే సాధ్యం కాకపోవచ్చని, ఆగస్టు వరకు అయితే ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version