పరాయి వారి పాలన అవసరమా ? తుమ్మలకు కందాళ కౌంటర్‌

-

పరాయి వారి పాలన అవసరమా ? అంటూ తుమ్మల నాగేశ్వర రావుకు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఖమ్మం నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో 3 కోట్ల 40 లక్షల రూపాయలతో కొనాయిగూడెం, నుండి బోదులబండ వరకు నిర్మించే బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి…ఈ సందర్భంగా మాట్లాడారు.

tummala vs kandala
tummala vs kandala

అదేదో సినిమాలో డైలాగ్ లాగా మాట తప్పను మడిమ తిప్పను…నేను అబద్ధం చెప్పను, చెప్పింది కచ్చితంగా చేస్తానన్నారు. మన నియోజకవర్గ ప్రజలకు పరాయి వాడి పాలన అవసరమా..దానధర్మాలు చేయటం నాకు మొదటినుంచి ఆ దయాగుణం ఉందని చురకలు అంటించారు.

నా చిన్నప్పుడే మేము తినే ముద్దాలో నలుగురికి పెట్టేవాళ్ళం….నేను ఎమ్మెల్యే అయినంక దానధర్మాలు చేయలేదని ఆగ్రహించారు. ఈ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి దానధర్మాలు చేసిన ఆ పేర్లు ఈప్పటికీ స్థిలాఫలకాల మీద అలానే ఉన్నాయి….నేను మీ లోకల్ బిడ్డను అని పేర్కొన్నారు. మీరు పంట పొలాలు ఎండిపోతున్నాయి అని నీరు కావాలని అడిగితే ” ఉచ్చ ” పోసుకోండి అన్ని చెప్పిన నాయకుడు కావాలా….మీరు అడిగిన ప్రతిసారి నీరు విడుదల చేసిన నేను కావాలా..మీరే తేల్చుకోండన్నారు ఎమ్మెల్యే కందాళ.

 

Read more RELATED
Recommended to you

Latest news