టీవీ నటుడు చందుకు పోస్టుమార్టం పూర్తి.. భార్య ఏమంటున్నారంటే..?

-

టీవీ నటుడు చందు హైదరాబాద్ లోని మణికొండలో నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన పార్థివదేహానికి శనివారం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టమార్టం నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. దీంతో చందు మృతదేహాన్ని
బన్సీలాల్ పేటలో స్వగృహానికి తీసుకెళ్తున్నారు. అనంతరం అంత్యక్రియలకు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తున్నారు.

మరోవైపు పవిత్ర జయరాం వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని చందు భార్య శిల్ప ఆరోపిస్తున్నారు. త్రినయని సిరియల్ సమయంలో తన భర్తకు పవిత్ర జయరాం పరిచయం అయ్యారని, అప్పటి నుంచి తనను చందు దూరం చేశారని తెలిపారు. పవిత్ర వచ్చిన తర్వాత తమ మధ్య గొడవలు జరిగాయని చెప్పారు. చందు ఇష్టప్రకారమే ఉండమని తాను చెప్పినట్లు తెలిపారు చందు, పవిత్ర జయరాం ఆరేళ్లుగా కలిసే ఉంటున్నారని శిల్ప తెలిపారు. పవిత్ర చనిపోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయారని చెప్పారు. తన భర్త చావుకు పవిత్రతో సంబంధమే కారణమని శిల్ప తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news