ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలకు 14 రోజుల రిమాండ్

-

తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీ  అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. 

అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న లను శనివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఇవాళ ఉదయమే వారిద్దరికీ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వీరికి కోర్టు 14 రోజుల విధించింది. దీంతో, పంజాగుట్ట పోలీసులు వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.  విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్ తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news