అమెరికా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

-

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మరణించారు. శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. అక్కడి పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గౌతమ్‌ కుమార్‌ మృతదేహం స్వగ్రామం చేరుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని, నివేశ్‌ మృతదేహాన్ని హుజూరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు.

బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన నివేశ్‌(20), జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని శివునిపల్లికి చెందిన గౌతమ్‌ కుమార్‌(19) అమెరికాలోని అరిజోనా స్టేట్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి వర్సిటీ నుంచి ఇంటికి కారులో వస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నివేశ్‌, గౌతమ్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news