సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..!

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  జి.కిషన్ రెడ్డి తాజాగా ఓ లేఖ రాశారు. ముఖ్యంగా  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్ రోడ్ల విస్తరణకు సహకారం అందించాలని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని.. వీలైనంత త్వరగా రోడ్లను పూర్తి చేయాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ప్రధానంగా ఇరుకు రహదారులతో పీక్ అవర్స్ లో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చొరువ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రైల్వే రంగంతో పాటు ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పై కేంద్రం దృష్టి సారించినట్టు తెలిపారు. ఇటీవలే తెలంగాణలో కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రన్విత్ సింగ్ బిట్టు పర్యటించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్.. రోడ్ల విస్తరణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.700కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నిర్మాణ పనులు 2026 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news