రేవంత్ రెడ్డికి ఎలాగూ క్యారెక్టర్ లేదు.. రాహుల్ గాంధీ నువ్వైనా నిలబెట్టుకో – కౌశిక్ రెడ్డి

-

బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారమే తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.

పార్టీ మారిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కెపి వివేకానంద గౌడ్, బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నేడు తీర్పును వెల్లడించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాగూ క్యారెక్టర్ లేదన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ.. మీరైనా క్యారెక్టర్ నిలబెట్టుకోవాలని అన్నారు కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news