Hyderabad : సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు

-

Hyderabad : సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు హైదరాబాద్‌ జనాలు. దీపావళి సంతోషంతోపాటు ప్రమాదాలని మోసుకువచ్చింది. అజాగ్రత్తగా టపాసులు కాల్చడం వల్ల ప్రమాదాల బారిన పడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒక్క హైదరాబాదులోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి 60 మందికి పైగా క్యూ కట్టారు.

Victims queue up at Sarojini Devi Eye Hospital

టపాసులు పేలడంతో గాయాల పాలై ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే…. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన వారిలో ఎక్కువ శాతం పెద్ద వారే ఉండడం. దీని మీద సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ…. దాదాపు 50 మంది ప్రమాద బాధితులు వచ్చారని తెలిపారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, వీరిలో ఒకరికి ఆపరేషన్ చేశామని తెలిపారు. ప్రమాద బాధితులకు డాక్టర్లు, సిబ్బంది అవసరమైన సహాయం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news