తెలంగాణ బిడ్డలారా…కేసీఆర్‌ ను ఓడించండి – విజయశాంతి

-

తెలంగాణ బిడ్డలారా…కేసీఆర్‌ ను ఓడించండని బీజేపీ నేత విజయశాంతి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అయ్యినాక 9 సంవత్సరాలకు, ఎన్నికల ముందు మల్ల కేసీఆర్ గారికి అమరవీరుల స్మారకం యాదికొచ్చినట్లుందంటూ ఎద్దేవా చేశారు.

రానున్న 5 నెలలల్ల కేసీఆర్ గారు చేసే ఇంకెన్నో మోస, విన్యాసాలు అర్థం చేసుకోకుంటే… మల్లా 5 సంవత్సరాల తర్వాతి రానున్న ఎన్నికల ముందు మాత్రమే వారిని చూడగలుగుతారని హెచ్చరించారు. తెలంగాణ బిడ్డలారా… ఈ అవినీతి అబద్ధపు ప్రభుత్వానికి తీర్పు ఇయ్యవలసిన కాలం ఆసన్నమవుతున్నదని చెప్పారు.

అందుకే కేసీఆర్‌ ను ఓడించాలని పిలుపునిచ్చారు విజయశాంతి. సంపన్న తెలంగాణను 6 లక్షల కోట్ల అప్పుకి దిగజార్చిన బీఆర్ఎస్ నుండి మనం కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సిన కర్తవ్యం మనకుందని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version