తెలంగాణ మాదని గర్వంగా చెప్పుకోవడానికి TS అని పెట్టాం – బీఆర్‌ఎస్‌

-

తెలంగాణ మాదని గర్వంగా చెప్పుకోవడానికి TS అని పెట్టామని బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ ప్రకటించారు. టీఎస్‌ ను టీజీగా మార్చడంపై బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌ స్పందించారు. తెలంగాణ రాష్ట్రం మాదని గర్వంగా చెప్పుకోవడానికి టీఎస్ అని పేరు పెట్టామని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది ఆంధ్ర ప్రాంత నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొత్తుగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

vinod kumar comments on ts and tg

రేవంత్ రెడ్డి…తెలంగాణ రాష్ట్ర చరిత్రను చెరిపే కుట్రకు తెరతీసారని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ వినోద్‌.అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన.. తెలంగాణ చరిత్రను మరుగున పడవేసే కుట్రను రేవంత్‌ రెడ్డి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాకతీయుల పాలనను మరిపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మన జాతీయ చిహ్నంలో అశోక స్థూపాన్ని తీసుకున్నామన్న వినోద్ కుమార్ అశోకుడు ఆనాడు దేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news