కొండా సురేఖపై తిరుగుబాటు…రేపు ఢిల్లీకి వరంగల్ కాంగ్రెస్‌ నేతలు !

-

కొండా సురేఖకు ఊహించిన షాక్‌ తగిలంది. కొండా సురేఖకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీకి వరంగల్ కాంగ్రెస్‌ నేతలు వెళ్లనున్నారట. అంటే కొండా సురేఖ ఎపిసోడ్ ఢిల్లీకి చేరిందన్న మాట. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రేపు ఢిల్లీకి వెళ్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసి వేణుగోపాల్ తో భేటీ కాబోతున్నారు. కొండా సురేఖ పై ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి దీపా దాసు మున్షీ.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు కలిసి ఫిర్యాదు చేశారు వరంగల్ కాంగ్రెస్‌ నేతలు. కొండా సురేఖకు వ్యతిరేకంగా రేపు ఢిల్లీకి వరంగల్ కాంగ్రెస్‌ నేతలు వెళ్లనున్నారట.

అటు వరంగల్ నేతల మధ్య గ్యాప్ పై స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్… కార్యకర్తల అత్యుత్సాహం వల్ల నేతల మధ్య కొన్ని సమస్యలు వస్తున్నాయన్నారు.
సమస్యలు పరిష్కరించుకోవాలని నేతలకు చెప్పామని… వరంగల్ జిల్లా నేతలు తనను కలిశారని వెల్లడించారు. వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారని… మా పార్టీ అంతర్గత విషయాలను మేం సరిచేసుకుంటామని తెలిపారు. ఏఐసీసీ ఇంచార్జీగా మున్షీని వరంగల్ నేతలు కలిశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version