రాష్ట్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం – నిరంజన్ రెడ్డి

-

వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణలో ప్రస్తుతం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ లో ఫుడ్ కాంక్లేవ్ – 2023 ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సాగుకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం, డైరీ రంగం అద్భుతంగా వృద్ధి చెందుతుంది అన్నారు. విజయ డైరీ ద్వారా అనేక ఉత్పత్తులను తీసుకువచ్చామని.. పౌల్ట్రీ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version