15 రోజుల్లో డ్రోన్ పాలసీ తీసుకొస్తాం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

-

ఏపీలో 15 రోజుల్లో డ్రోన్ పాలసీ తీసుకొస్తామని  సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాజాగా విజయవాడలో డ్రోన్ షో ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్ లో గేమ్ ఛేంజర్ కానుందని తెలిపారు. విజయవాడ వరదల్లో డ్రోన్లు వినియోగించి ఆహారం, తాగునీరు అందించామని గుర్తు చేశారు.

ముఖ్యంగా 1995లో తొలిసారి తాను ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. ఆ రోజుల్లోనే పీపీపీ పద్దతిలో హైటెక్ సిటీని నిర్మించామని పేర్కొన్నారు. అమెరికా వెళ్లి 15 రోజుల పాటు పలు సంస్థల ప్రతినిధులను కలిసినట్టు గుర్తు చేశారు. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాలలో దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్ అని చెప్పారు. విదేశాలలో ఉన్న ఐటీ నిపుణులలో 30 శాతం మంది తెలుగు వారే ఉండటం గొప్ప విషయం అన్నారు. ప్రస్తుతం నిజమైన సందప డేటా. భవిష్యత్ లో దేశానికైనా.. కంపెనీకైనా డేటానే కీలకం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news