రాజకీయాలనుంచి తప్పుకుంటా – మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు

-

మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం కి తన సేవలు అవసరం లేదనుకున్న రోజున రాజకీయాల నుంచి వైదొలుగుతానని అన్నారు. ఖమ్మం నగరంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అనేకమంది అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి అభివృద్ధి చేశామన్నారు.

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిరహిత కార్పోరేషన్ గా నిలిచిందన్నారు. బిఆర్ఎస్ లో ప్రస్తుత సీఎం, కాబోయే సీఎం ఇద్దరూ ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు మంత్రి పువ్వాడ. గొంగళి పురుగులా ఉన్న ఖమ్మం పట్టణాన్ని సీతాకోక చిలుకలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కే దక్కుతుందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news