సిట్టింగ్ లకే సీట్లు ఇచ్చే ధైర్యం కేసిఆర్ కు ఉందా..?- రేవంత్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ నిజంగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే తిరిగి సెట్టింగ్లకే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. నేడు అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, న్యాయవాది గంగాపురం రాజేందర్, మాజీ జెడ్పిటిసి భీముడు నాయక్ ఇతర బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమిని ఎమ్మెల్యేల ఖాతాలలో వేసేందుకు కేసీఆర్ డ్రామాలు చేస్తున్నాడని విమర్శించారు.

రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో నాశనం చేశారని విమర్శించారు. ఇక కెసిఆర్ అరాచక పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదన్నారు. కేసీఆర్ పుట్టకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ పుట్టక ముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందని.. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news