సచివాలయం నిర్మాణం అద్భుతం : ఎంపీ విజయేంద్రప్రసాద్‌

-

తెలంగాణ నూతన సచివాలయం అద్భుతంగా కొన్నిరోజుల క్రితమే ప్రారంభమైంది. ప్రారంభం రోజు నుంచి రోజూ ఏదో ఒక అంశంపై మంత్రులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నూతన సచివాలయంలో గురువారం రోజున తొలి మంత్రి వర్గ భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త సచివాలయాన్ని చూసి చాలా మంది ఈ అద్భుత కట్టడం గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే నూతన సచివాలయం వద్ద ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా నూతన సచివాలయాన్ని ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ సందర్శించారు. భావితరాలకు దిక్సూచిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అంబేడ్కర్‌ సచివాలయాన్ని ముందుచూపుతో అద్భుతంగా నిర్మించారని విజయేంద్రప్రసాద్‌ ప్రశంసించారు.

ప్రముఖ నిర్మాత, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత కొణతం లక్ష్మణ్‌, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవతో కలిసి గురువారం ఆయన నూతన సచివాలయాన్ని సందర్శించారు. అనంతరం ఎంపీ సంతోష్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. అతి తక్కువ సమయంలో, తక్కువ బడ్జెట్‌తో అద్భుతమైన కట్టడాన్ని సీఎం కేసీఆర్‌ నిర్మించారని విజయేంద్రప్రసాద్‌ కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version