యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్ కొడంగల్‌కు తరలింపు!

-

సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్ కొడంగల్‌కు తరలింపునకు చర్యలు తీసుకుంటున్నారట. గత సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం 5 జూలై 2023న రూ.183 కోట్లతో యాదగిరిగుట్టకు మెడికల్ కాలేజ్, 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయగా అది సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

Yadagirigutta Medical College shifted to Kodangal

కాగా, ఈరోజు అసెంబ్లీలో ప్రభుత్వం 2024-25 బడ్జెట్ అంచనా రూ. 2.95 లక్షల కోట్ల నుంచి రూ. 3 లక్షల కోట్లు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ప్రకటించిన చివరి బడ్జెట్ రూ. 2.90 లక్షల కోట్లు. ఈసారి మరో రూ. 10వేల కోట్లు పెరిగి రూ. 3 లక్షల కోట్లను తాకే ఛాన్స్ ఉంది. ఇందులో సంక్షేమ రంగానికి రూ. 40 వేల కోట్లు, వ్యవసాయానికి రూ. 30 వేల కోట్లతో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news