కరీంనగర్ లో ఉన్మాదం.. ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి

-

కరీంనగర్లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించాలంటూ యువతిపై ఒత్తిడి తెచ్చిన ఆ యువకుడు ఆమె అంగీకరించకపోవడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిపై కత్తితో దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. గురువారం సాయంత్రం జిల్లాలోని కొత్తపల్లి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న కొత్తపల్లికి చెందిన యువతి(26)ని ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న బొద్దుల సాయి గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఆమె నిరాకరించడంతో పలుమార్లు గొడవలు జరిగి ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. అయినా యువకుడిలో మార్పు రాలేదు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని వారం కిందట యువతి తండ్రి సెల్‌ఫోన్‌కు నిందితుడు రెండుసార్లు మెసేజ్‌లు పంపించి రిప్లై రాకపోవడంతో కోపం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెతో గొడవకు దిగగా యువతి నిరాకరించడంతో కత్తితో మెడపై దాడికి తెగబడ్డాడు. అడ్డుకునే ప్రయత్నంలో ఆమె చేయి తెగింది. యువతి అరుపులతో అక్కడికి చేరుకున్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాయి పరారయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news