తెలంగాణాలో విషాదం చోటు చేసుకుంది. BMW కారు కోనివ్వలేదని యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకొని బ్రతికే తమకు అంత స్థోమత లేదని తల్లిదండ్రులు చెప్పినా వినకుండా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో పదవ తరగతి వరకు చదివి, తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు బొమ్మ కనకయ్య, కనకమ్మ దంపతుల కుమారుడు జానీ (21). గత కొంత కాలంగా తనకు BMW కారు కొనివ్వాలని తల్లిదండ్రులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడు జానీ. తమకు అంత స్థోమత లేదని స్విఫ్ట్ డిజైర్ కారు కొనిస్తామని చెప్పారు తల్లిదండ్రులు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న జానీ… అందరికి షాక్ ఇచ్చారు.