బాలికతో రెడ్ హ్యాండెడ్​గా దొరికిన యువకుడు.. తల్లిదండ్రులు చితకబాదడంతో మృతి

-

మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ ‌కారిడార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ యువకుడు మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లాడు. గమనించిన స్థానికులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు వచ్చి యువకుడిని చితకబాదారు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడు (18), బాలిక (15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ సంగతి తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు అతడిని మందలించారు. బుధవారం రోజున తల్లిదండ్రులు బాలికను ఇంట్లో ఒంటరిగా వదిలి పనిమీద బయటకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు రాత్రి సమయంలో వారి ఇంటికి వెళ్లాడు. గమనించిన స్థానికులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు వెంటనే ఇంటికి చేరుకున్నారు. యువకుడిని రహస్య భాగాలపై కారం వేసి చితకబాదడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news