పారాగ్లైడింగ్ చేస్తూ జహీరాబాద్ మహిళ మృతి

-

సాహసం చేయాలనే ఆసక్తితో పారాగ్లైడింగ్ చేసే ప్రయత్నంలో ఇటీవల కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ లో తెలంగాణ యువకుడు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా మరో మహిళ కూడా ఈ సాహసం చేస్తూ మృతి చెందింది. భర్త కళ్లముందే పారాగ్లైడింగ్‌ చేస్తున్న భార్య ప్రమాదవశాత్తు చనిపోయింది.

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణం శిల్ప బృందావనం కాలనీకి చెందిన సాయి మోహన్‌, నవ్య(26) దంపతులు విహారయాత్రకై శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నవ్య పారాగ్లైడింగ్‌ చేస్తుండగా కొద్దిసేపటికే హుక్‌ ఊడిపోయి ఓ ఇంటి పైకప్పుపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పారాగ్లైడింగ్‌ చేయించిన పైలట్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని హిమాచల్‌ప్రదేశ్‌ పర్యాటక అధికారులు బాధిత కుటుంబికులకు సమాచారం ఇచ్చారు. పైలట్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news