కేదార్‌నాథ్‌లో చిక్కుకున్నతెలుగు యాత్రికులు

-

ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌‌లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. సుమారు 20 మంది యాత్రికులు కేదార్ నాథ్‌లో చిక్కుకున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరిలో విజయనగరం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, భోజనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు కుటుంబసభ్యులకు కాల్ చేసి కన్నీరుమున్నీరు అయినట్లు సమాచారం అందుతోంది.

శుక్రవారం హెలికాప్టర్ రావాల్సి ఉన్నా.. వాతావరణం అనుకూలించకపోవడంతో మరో 2 రెండు రోజులు అక్కడే ఉండాల్సి రావొచ్చని అధికారులు పేర్కొన్నారు.అయితే, ఉన్నట్టుండి ఉత్తరభారతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కేదార్ నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news