Breaking : హిందూపురంలో ఉద్రిక్తత.. రామకృష్ణరెడ్డి మృతదేహాంతో వైపీసీ కార్యకర్తల ర్యాలీ

-

సత్యసాయి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ అసమ్మతి నేత చౌలూరు రామకృష్ణారెడ్డిని గుర్తుతెలియని.. వ్యక్తులు హత్యచేశారు. బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న రామకృష్ణారెడ్డి ఇంటి సమీపంలో కారును పార్క్ చేస్తున్న సమయంలో వేట కొడవళ్లతో 18 చోట్ల నరికి చంపారు. తీవ్ర గాయాలైన రామకృష్ణారెడ్డిని, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సొంత పార్టీ నేతలే తన కుమారుడిని చంపారని రామకృష్ణారెడ్డి తల్లి ఆరోపించారు. ఎమ్మెల్సీ, మరికొంత నాయకులు కలిసి.. తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ విలపించారు.

ఇటీవల హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు చోటుచేసుకుని ఆగస్టు 15న ఉద్రిక్తత ఏర్పడింది. అప్పుడు చౌలూరు రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్గీయుల మధ్య వర్గపోరు తీవ్ర స్థాయికి చేరింది. ఆ వివాదం నెలకొన్న చోటే చౌలూరు రామకృష్ణారెడ్డి హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వైసీపీ నేత రామకృష్ణారెడ్డి మృతదేహంతో హిందూపురం చౌలూరులో ఆందోళన చెపట్టారు. వైసీపీలో వర్గ విభేదాలతో హత్య చేశారని బంధువుల ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని రామకృష్ణారెడ్డి బంధువుల డిమాండ్ చేశారు. దీంతో హిందూపురంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version