రాజ్యసభ ఎఫెక్ట్..గందరగోళంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు !

-

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల గుండెల్లో గుబుల్‌ నెలకొంది. టీడీపీ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యేల చేరికపై రాజ్యసభ ఎఫెక్ట్ పడింది. ఈ తరుణంలోనే… టీడీపీ పార్టీలో వైసీపీ ఎమ్మెల్యే పార్దసారధి చేరిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పార్దసారధితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎలీజా, రక్షణ నిధి కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.

Tension For YCP rebel MLAs

ఇక ఇప్పుడు పార్టీ మారిన వారి పైనా అనర్హత వేటు పడే అవకాశం లేకపోలేదని టీడీపీ అంచనా వేస్తోంది. అటు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతుండడంతో టీడీపీలో ఎమ్మెల్యేల చేరికల జాప్యమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ సంఖ్యాబలం వీలైనంతగా తగ్గించే వ్యూహాల్లో వైసీపీ ఉందని సమాచారం అందుతోంది. రాజీనామా ఆమోదంతో రాజ్యసభ ఎన్నికల్లో ఓటే వేయలేని స్థితిలో గంటా శ్రీనివాస్‌ ఉన్నారు. ఇక అటు అనర్హత వేటు పడితే ఓటు వేసే అవకాశాన్ని మరో నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోల్పోతారు.

Read more RELATED
Recommended to you

Latest news