అందుకే అన్నయ్య పార్టీకి విరాళం ఇచ్చారు: పవన్ కల్యాణ్

-

రైతుల కోసమే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.కోనసీమ అంబేడ్కర్ జిల్లా పి. గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…సర్ ఆర్థర్ కాటన్‌లా రైతుల కోసం పనిచేస్తా అని తెలిపారు. అమలాపురం రైతులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. సినిమాల్లోనే ఉంటే కోట్లు సంపాదించుకునే వాడిని.. యువత, ఆంధ్ర ప్రజల భవిష్యత్ కోసం రాజకీయాల్లోకి వచ్చి అందరి చేతా తిట్టించుకుంటున్నానని అసహనం వ్యక్తం చేశారు.

అన్నయ్య చిరంజీవి నా మంచి కోరుకునే వ్యక్తి అని , రైలు రైతులకు అండగా ఉండాలని పార్టీకి విరాళం ఇచ్చారని వెల్లడించారు.కాకినాడలో మాఫియా డాన్‌ను తరిమేస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని అన్నారు. ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలని ,వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news