ఇలాంటి వారి విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. అదేంటంటే.. ?

-

ఇదివరకు కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు, ఆధార్ కార్డు కలిగిన వారు త్వరగా ఈ రెండిటిని ఒకదానితో ఒకటి అనుసంధానించుకోవాలని చెప్పిని విషయం తెలిసిందే ఇందుకు గాను విధించిన గడువు కూడా ముగిసిపోయింది.. అయితే ఇప్పుడు ఈ రెండు నెంబర్లను లింక్ చేసుకునే సమయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది..

ఇకపోతే పాన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ల అనుసంధానానికి గడువు 2021 మార్చి 31గా పేర్కొంటుంది.. ఈ నిర్ణయం వల్ల ఇప్పటి వరకు ఆధార్, పాన్ లింక్ చేసుకొని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా పోయింది.. ఇకపోతే పాన్ కార్డు, ఆధార్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఈ రెండింటినీ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే భారీ జరిమానా ఎదుర్కోవలసి రావొచ్చు. అంతేకాకుండా మీకు పాన్ కార్డు కూడా పని చేయదు.

 

కాగా పన్ను చెల్లింపుదారులకు కూడా కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ డెడ్‌లైన్‌ను మరికొంత కాలం పొడిగించింది. జూలై 31 వరకు ఐటీఆర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుంది. ఇదే కాకుండా చిన్న, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే విధంగా సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ పేమెంట్‌కు డెడ్‌లైన్‌ను నవంబర్ 30 వరకు పొడిగించింది. అయితే రూ.లక్ష వరకు చెల్లింపులకు మాత్రమే ఇది వర్తిస్తుందని, ఈ పరిమితి దాటిన చెల్లింపులకు ఎటువంటి మినహాయింపు లేదని పేర్కొంది..

Read more RELATED
Recommended to you

Latest news