సీఎం గారు.. మీకు అది కనబడుతుందా : దేవినేని

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. రోజుకో వివాదం రాష్ట్రంలో చోటుచేసుకుంటుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. తీవ్రంగా విమర్శించుకుంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా.. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “సెంటు ఇంటి స్థలం పేరిట వేలకోట్ల దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల నివేదికలు తొక్కిపట్టి మునిగిపోయే భూములకు లక్షలు చెల్లించారు. స్థలాల మేరువ పేరిట వందల కోట్ల ప్రజాధనం దోచేస్తున్న మీపార్టీ నేతల అక్రమాల బాగోతాలు తాడేపల్లి రాజప్రసాదానికి వినబడుతున్నాయా కనబడుతున్నాయా చెప్పండి సీఎం గారు” అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news