ట్రాఫిక్ చ‌లాన్ల చెల్లింపున‌కు నేటితో ముగియ‌నున్న గ‌డువు

-

పెండింగ్లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించేందుకు రాష్ట్రంలోని వాహనదారులకు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే . అయితే పెండింగ్ చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. మ‌రోసారి గ‌డువు పొడిగింపు ఉండ‌ద‌ని గ‌తంలోనే అధికారులు వెల్లడించారు. దీంతో పెండింగ్ చ‌లాన్ల చెల్లింపుల‌కు గురువారం అర్ధ‌రాత్రి 11:59 గంట‌లకు గ‌డువు ముగియ‌నుంది.వాహనాలపై ఉన్న ఫైన్లు చెల్లించే వారు ఈ కన్సెషన్ ఆఫర్ వినియోగించుకోవాలనుకుంటే వెంటనే చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ విభాగం కోరింది. 2023 Dec 25కి ముందు ఉల్లంఘనలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది.

ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు ,తోపుడుబండ్లపై 90% రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50% రాయితీని కల్పించింది. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news