రెస్టారెంట్లు హోటల్స్ లో మద్యం తాగడానికి అనుమతి…!

-

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పుడు మన దేశంలో రెస్టారెంట్, హోటల్స్ ని మూసి వేసారు. దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఎక్కువ కావడంతో కేంద్రం షరతులతో కూడిన అనుమతులను మాత్రమే ఎక్కువగా ఇస్తుంది. ఈ తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం హోటళ్ళు మరియు రెస్టారెంట్లలో మద్యం సేవించడానికి అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించడానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్న యూనిట్లకు మాత్రమే ఈ అనుమతి మంజూరు చేసింది.

అయితే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్‌లాక్ 3 మార్గదర్శకాల ప్రకారం, ప్రస్తుతం బార్‌లు పనిచేయడానికి అనుమతించబడవు అని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. ఢిల్లీలో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయి. అక్కడ కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గింది. కరోనా వైరస్ తగ్గు ముఖం పట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version