పవన్ కళ్యాణ్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన డైరెక్టర్..!!

-

ఎట్టకేలకు దర్శకుడు హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ అందించారని చెప్పవచ్చు. ఇటీవల హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా అనౌన్స్మెంట్ అయ్యి ఏడాది అవుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ రాకపోవడమే అభిమానులలో నిరాశను మిగిల్చింది. ఒకపక్క పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం.. మరొకపక్క జాగర్లమూడి రాధాకృష్ణ కాంబినేషన్లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కాకపోవడం వల్లే దర్శకుడు హరీష్ శంకర్ తన సినిమాను పట్టాలెక్కించలేదు.

ఒకవేళ ఈ సినిమా పూర్తవుతుందేమో అని ఎన్ని ప్రయత్నాలు చేసినా దర్శకుడు కానీ ఇటు నిర్మాతలు కానీ ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడమే కారణం. మరొకపక్క మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ప్రాజెక్టు మాత్రం ముందుకు కదలడం లేదని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నుంచి సినిమా అప్డేట్లు ఎప్పుడు వస్తాయని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి వారికే తాజాగా హరీష్ శంకర్ ఒక అదిరిపోయే శుభవార్త తెలిపాడని చెప్పవచ్చు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.


ఇప్పుడు మరొకసారి వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటే చాలామంది ఈ సినిమాపై ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. అంతేకాదు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడు అని కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. అసలు గుడ్ న్యూస్ ఏమిటంటే నిన్న పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా హరీష్ శంకర్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే త్వరలోనే మీతో షూటింగ్ ప్రారంభం చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంటూ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే ఎంపికైంది కాబట్టి ఇక త్వరలోనే సినిమా సెట్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. ఇక ఇలా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు హరీష్ శంకర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version