సొరంగంలోకి వెళ్లిన రైలు అదృశ్యం…’అద్భుతం’ మూవీని మించిపోయిందిగా..!

-

ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన అద్భుతం మూవీ చూశారా..ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కొంచెం కన్ఫూషన్, కొంచెం ఆసక్తీ కలిగి ఉంటాయి. అలా ఎలా సాధ్యం అని అనుమానం కూడా వస్తుంది. కానీ సరిగ్గా ఆ మూవీలో జరిగినట్లే కొన్ని వందల సంవత్సరాల క్రిందట జరిగిందట. ఒక స్వరంగంలోకి వెళ్లిన రైలు మాయం అయి..అందులోని వ్యక్తులు 66 సంవత్సరాల వెనక్కు వెళ్లారట. వెళ్లింది కూడా వాళ్లు ఉన్న దేశం కాదు..ఇటలీ నుంచి ఈజిప్టుకు వెళ్లారు ఈజిప్టులో మేమం ఇటలీ వాళ్లం అని చెప్తే..వాళ్లు నమ్మలేదు. ఇటలీ అధికారులకు కాల్ చేస్తే..మా దేశంలో ఎవరూ తప్పిపోలేదు అన్నారు. అసలు ఇదంతా భలే వెరైటీగా ఉంది. ఆ రైలేంటి, వాళ్లు ఫైనల్ గా ఏమయ్యారో చూద్దాం.

110 సంవత్సరాల కిందట అంటే 1911లో ఇటలీలోని జనెటి అనే కంపెనీ.. మూడు బోగీల న్యూ మోడల్‌ ట్రైన్‌ను ప్రవేశపెట్టింది. ‘ఉచిత ప్రయాణం చేసేవాళ్లకు ఇదే అరుదైన అవకాశం’ అంటూ ప్రకటించే సరికి… ఉత్సాహవంతులు ఎగబడ్డారు. వంద మంది ప్రయాణికులు.. ఆరుగురు రైల్వే సిబ్బందితో మొత్తం 106 మంది రోమ్‌ నగరం నుంచి ఆ ట్రైన్‌లో బయలుదేరారు. దారిలో ఓ పర్వత ప్రాంతం మీదుగా పోతున్న ఆ ట్రైన్‌.. ఒక కిలోమీటరు పొడవున్న సొరంగంలోకి వెళ్లింది.

అంతే, ఆ తర్వాత ఆ ట్రైన్‌ మరో స్టేషన్‌ని చేరుకోలేదు. కనీసం ఆ సొరంగాన్ని కూడా దాటలేదట. ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన రైల్వే అధికారులు సొరంగాన్ని చేరి, కిలోమీటరు పొడవునా క్షణ్నంగా గాలించారు. ఎలాంటి ఆధారం దొరకలేదు. పోనీ ఆ సొరంగానికి మరో మార్గం ఏదైనా ఉందా అంటే, అదీ లేదు. ఏమైనా చిన్న వస్తువా అంత పెద్ద ట్రైన్ ఎలా మిస్స్ అవుతుంది? ఈ ప్రశ్నలు అప్పటి వార్తాపత్రికలు, మేధావులు, ఉన్నతాధికారులు బుర్రబద్ధలు కొట్టుకున్న సమాధానం దొరకలేదు.

సరిగ్గా అప్పుడే ఆ ట్రైన్‌ నుంచి బయటపడిన ఇద్దరు ప్రయాణికుల సమాచారం వచ్చింది.. ఆ ఇద్దరూ భయంతో రైలు నుంచి దూకేశారని చెప్పారు. మరి మిగిలిన నూట నాలుగు మంది ఏమయ్యారు? మూడు బోగీల ట్రైన్‌ ఎక్కడికి వెళ్లింది? రైలు నుంచి దూకిన ఆ ఇద్దరు ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందారు.. కొన్నాళ్లకు ఆ ఇద్దరిలో ఒకతను నోరు విప్పాడు. అసలు విషయం బయటపెట్టాడు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

ఆ రోజు రైలు సొరంగంలోకి ప్రవేశించగానే తెల్లని పొగ కమ్మేసిందని, రైల్లో ఉన్నవాళ్లంతా పెద్దపెద్దగా అరవడం విని భయంతో బయటకు దూకేశామని, ఆ తర్వాత రైలు ఏమైందో తెలియదని అతను చెప్పాడు. అతడు చెప్పింది విని చిన్నపాటి ఆశతో మరోసారి ఆ సొరంగాన్ని శోధించారు అధికారులు. ఫలితం లేదు.

66 సంవత్సరాల వెనక్కి

1911లో మిస్సైన నూట నాలుగు మంది ప్రయాణికులు.. 1845 సంవత్సరానికి చేరుకున్నారనే ఓ రిపోర్ట్‌ 1926లో అంటే ట్రైన్‌ మిస్‌ అయిన పదిహేనేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. అది విన్న యావత్‌ ప్రపంచం ఒక్కసారగా షాక్ అయింది. అప్పటి మెక్సికో అధికారిక సమాచారం ప్రకారం 1845 సంవత్సరంలో ఆ 104మంది ప్రయాణికులు.. ‘మేమంతా ఇటలీలోని రోమ్‌ నుంచి జనెటి ట్రైన్‌లో ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు.

అయితే పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో–ఇటలీల మధ్య రైల్వే మార్గం లేదు. సముద్రయానం తప్ప మరో దారి లేదు. అలాంటిది.. ‘మేమంతా ఇటలీ నుంచి రైల్లో వచ్చాం’ అని వాళ్లు చెప్పడంతో అక్కడ అధికారులు వాళ్లని పిచ్చివాళ్లుగా భావించి మానసిక చికిత్సాలయంలో చేర్పారు. ఆ తర్వాత కూడా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మెక్సికో అధికారులు.. ఇటలీ అధికారులని సంప్రదించారు.

అయితే, అది 1845వ సంవత్సరం కావడం వల్ల అప్పటికి ‘1911 ట్రైన్‌ మిస్సింగ్‌’ ఘటన ఇటలీలో చోటుచేసుకోలేదు. దాంతో ఆ నూట నాలుగు మంది తమ దేశం వాళ్లు కాదని, అలాంటి ట్రైన్‌ తమ వద్ద లేనే లేదని తేల్చేసింది ఇటలీ. ఆ 140 మందిలో ఒక వ్యక్తి దగ్గర ‘డన్హిల్‌’ కంపెనీకి చెందిన సిగార్‌ పెట్టె దొరికింది. దాని మీద ‘1907’ సంవత్సరం ప్రింట్‌ అయ్యి ఉండటంతో అక్కడి వాళ్లంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

అయితే ఈ ట్రైన్‌ రష్యా, జర్మనీ, రుమేనియా, ఇటలీతో పాటు ఇండియాలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ మాయమవుతూ ఉందని, 1991లో ఉక్రేయి¯లోని పోల్టావాలోనూ ఈ రైలు కనిపించిందని, ఆత్మలపై పరిశోధనలు చేసే ఓ వ్యక్తి ఈ రైలులోకి దూకాడని, ఆ తర్వాత మళ్లీ అతడు కనిపించలేదని, ఇదో ఘోస్ట్‌ ట్రైన్‌ అని హడలెత్తించే పలు కథనాలు వచ్చాయి.

అయితే 1911లో ఇటలీలో ట్రైన్‌తో సహా మిస్‌ అయిన 104 మంది 66ఏళ్ల వెనక్కు వెళ్లి 1845లో మెక్సికోలో ప్రత్యక్షం కావడమేంటీ? పైగా వారి దగ్గర 1907 సంవత్సరం నాటి సిగార్‌ ప్యాకెట్‌ దొరకడమేంటి? అనేది ఈరోజికి మిస్టరీగానే మిగిలిపోయింది.

యుద్దంలో ఆ సొరంగం నాశనం

జనెటి ట్రైన్‌ని మాయం చేసిన ఆ సొరంగం.. ప్రపంచయుద్ధ సమయంలోని వైమానిక దాడుల్లో నాశనం అయింది. ఇటలీలోని రైల్వే మ్యూజియంలో నేటికీ ఆ ట్రైన్‌ మోడల్‌ ప్రదర్శనకు ఉంచారు.. ఇక ఆ ట్రైన్‌లో లభించిన 1907 నాటి సిగార్‌ ప్యాకెట్‌ని ఇప్పటికీ మెక్సికోలోనే భద్రపరిచారట. అంతా భలే గమ్మత్తుగా ఉంది కదూ..

Read more RELATED
Recommended to you

Latest news