రాష్ట్రపతి అనే అహం ప్రణబ్ లో ఉండేది కాదు…!

-

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన నివాసం వద్దకు వెళ్లి ప్రణబ్ సేవలను కొనియాడుతూ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చీఫ్ మోహన్ జీ భగవత్ కూడా నివాళి అర్పించారు.

pranab
pranab

ప్రణబ్ ముఖర్జీ అసమానమైన వ్యక్తి అని కీర్తించారు. ఆయన ఉదారంగా ఉండటమే కాకుండా దయగల వ్యక్తి అని కొనియాడారు. తాను భారత రాష్ట్రపతిగా మాట్లాడుతున్నానని ఆయన మరచిపోయేవాడని గుర్తు చేసుకున్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరినీ, తన సొంతం చేసుకోవడం అతని స్వభావమని అన్నారు. ఆయన ఎప్పటికి కూడా గుర్తు ఉంటారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news