హత్రాస్ బాధితురాలిపై అత్యాచారం జరగలేదు..?

-

బాధితురాఉత్తరప్రదేశ్లోని హస్రత్ లో జరిగిన అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో మరో నిర్భయ ఘటన గా మారిన ఈ ఘటనలో నిందితులను ఉరిశిక్ష వేసి శిక్షించాలి అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అదేసమయంలో ఈ అత్యాచార బాధితురాలి పోస్టుమార్టం ఫోరెన్సిక్ రిపోర్టులో కూడా సంచలన నిజాలు బయట పడుతున్నాయి. ఇప్పటికే పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారలి మెడ ఎముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు ఒంటిపై బలమైన గాయాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.

ఇక ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్టులో మరిన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఇటీవలే ఈ సంచలన విషయాలను బయటపెట్టారు యూపీ సీనియర్ పోలీస్ అధికారి సంతోష్ కుమార్. హత్రాస్ ఘటనలో బాధితురాలిని నిందితులు అత్యాచారం చేయలేదు అన్న విషయాన్ని తెలిపారు. ఇటీవలే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులో ఈ విషయం బయటపడిందని ఆయన ఆయన చెప్పుకొచ్చారు. బలమైన గాయం కారణంగా నే సదరు బాధితురాలు మరణించింది అంటూ తెలిపిన పోలీస్ అధికారి.. బాధితురాలు వాంగ్మూలంలో తనపై దాడి జరిగిందని చెప్పింది తప్ప అత్యాచారం జరిగింది అన్నది చెప్పలేదు అన్న విషయాన్ని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version