రైతులకు ముఖ్య గమనిక.. సీఎం జగన్ ఏమన్నారంటే.!

-

మొదటి నుంచి వ్యవసాయ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు మద్దతు తెలపడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరికీ వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించేందుకు శరవేగంగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ మోటార్ల ద్వారా ప్రభుత్వం రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ జగన్ సర్కారు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.

ఇక ఇటీవల ఇదే విషయంపై మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని రైతులు అన్ని వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం ద్వారా రైతుల పై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు అనే విషయాన్ని అందరికీ తెలియజేసేలా ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. అంతేకాకుండా వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు తో ఎలాంటి అంతరాయం లేకుండా రైతులు కరెంటు పొందవచ్చు అని తెలిపారు అంతేకాకుండా పట్టపగలు నాణ్యమైన 9 గంటల విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అంటూ చెప్పుకొచ్చారు సీఎం.

Read more RELATED
Recommended to you

Exit mobile version