ములుగులో దారుణం.. కూత‌రు మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక త‌ల్లి మృతి

-

క‌న్న కూతురు మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక ఒక తల్లి మృతి చెందింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న తెలంగాణ‌లోని ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లాలోని వెంక‌టాపురం మండ‌లం మొర్ర‌వాని గూడెంలో పోతురాజు దేవ‌మ్మ నివాసం ఉంటుంన్నారు. వీరికి ఇద్ద‌రు కూత‌ర్లు ఉన్నారు. పెద్ద కూతురు దీప ప్రియ (26) ను అదే గ్రామానికి చెందిన శివ ప్రాస‌ద్ కు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్ద‌రు కూతుర్లు ఉన్నారు. అయితే దీప ప్రియ కు భ‌రించ‌లేనంత క‌డుపు నొప్పి రావడంతో భ‌ద్రాచ‌లంలోని ఒక ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అక్కడ ఆప‌రేష‌న్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తుండ‌గా శ‌నివారం రాత్రి దీప ప్రియ క‌న్నుమూసింది. అయితే దీప ప్రియ మృత దేహాన్ని స్వ‌గ్రామానికి తీసుకువ‌చ్చారు. దీప మృత దేహం వ‌ద్ద త‌ల్లి దేవ‌మ్మ ఏడుస్తూనే ఉంది. దీంతో కూతురు మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక త‌ల్లి దేవ‌మ్మ ఆదివారం ఉద‌యం సృష త‌ప్పి ప‌డిపోయింది. ఆస్ప‌త్రి త‌ర‌లించే లోపే త‌ల్లి దేవ‌మ్మ మృతి చెందింది. దీంతో ఒకే కుటుంబంలో ఇద్ద‌రు ఒకే రోజు వ్య‌వ‌ధిలో మ‌ర‌ణించ‌డంతో ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news