సన్ రైజర్స్ కి వార్నింగ్ ఇచ్చిన పంజాబ్ కొత్త కెప్టెన్

-

పంజాబ్ కింగ్స్ తమ చివరి మ్యాచ్‌లో జితేశ్‌ను కెప్టెన్‌గా నియమించినట్టు పంజాబ్ ఫ్రాంచైజీ శనివారం వెల్లడించింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌ పంజాబ్‌కు ఆఖరిది.

పంజాబ్ ఇప్పటికే కెప్టెన్ గా ఈ సీజన్లో శిఖర్ ధావన్ 5 మ్యాచ్‌లకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరించాడు.గత నెల 9న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సామ్ కర్రన్ గాయపడి మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ నెల 15న రాజస్థాన్‌ రాయల్స్ తో మ్యాచ్ అనంతరం జాతీయ జట్టు బాధ్యతల నేపథ్యంలో అతను ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్‌ తో మ్యాచ్‌లో జితేశ్‌కు పగ్గాలు దక్కాయి. ఈ సీజన్‌లో పంజాబ్‌కు నాయకత్వం వహిస్తున్న మూడో సారథి జితేశ్ శర్మ.ఈ సీజన్‌లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన పంజాబ్ కింగ్స్ హైదరాబాద్‌పై నెగ్గి విజయంతో సీజన్‌ను ముగించాలని భావిస్తున్నది. ఈ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్ జట్టును జితేశ్ హెచ్చరించాడు. శనివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతను మాట్లాడుతూ.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో నిర్భయంగా ఆడతామని అన్నారు. ఇంకా తాము కోల్పోయేది ఏం లేదని, విజయమే లక్ష్యంగా ఆడతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news