బోల్తాకొట్టిన చేపల లారీ.. ఎగబడిన జనాలు!

-

చేపల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. దీంతో అందులోని చేపల నేలపై పడిపోగా, స్ధానిక జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. దొరికిన కాడికి చేపలను దండుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు చేపల లోడుతో వెళ్తున్న లారీ మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో అదుపుతప్పి బోల్తా పడింది.

అందులో ఉన్న చేపలు మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో బతికున్న చేపల కోసం ప్రజలు ఎగబడ్డారు. అందినకాడికి నిమిషాల్లో చేపలన్నింటినీ ఎత్తుకెళ్లారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారిని అదుపుచేశారు. ఈ ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రమాదానికి గురైన లారీని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను వెంటనే పునరుద్దరించారు.

Read more RELATED
Recommended to you

Latest news