శాలిబండ పై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు

-

ప్రస్తుతం నగరంలోని శాలిబండ లో ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. అయితే శాలిబండలో అల్లర్లు జరగవచ్చనే సమాచారంతో ఇప్పుడిప్పడే శాలిబండకు చేరుకుంటున్నాయి పోలీసు బలగాలు. శాలిబండ పై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. ఇప్పటివరకు జరిగిన ఆందోళనలు అన్నీ శాలిబండ కేంద్రంగానే జరిగాయి. దీంతో శాలిబండ పై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం సామూహిక ప్రార్థనల సందర్భంగా టెన్షన్ నెలకొంది.

మరికాసేపట్లో శాలిబండను తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు పోలీసులు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు సౌత్ జోన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అలాగే సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. ఇప్పటికే సోషల్ మీడియాలో యువతను రెచ్చగొట్టిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎంఐఎం వ్యతిరేకవర్గంపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు పోలీసులు. మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసే వరకు ఈ హై టెన్షన్ కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version