BREAKING : తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీగా నిధులు మాయం

-

తెలుగు అకాడమీ కేసు తరహాలో మరో భారీ మోసం తెలంగాణ రాష్ట్రంలో వెలుగు లోకి వచ్చింది. తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీగా ఫిక్స్‌డ్ డిపాజిట్ నిధులు మాయం అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల శాఖ కు చెందిన రూ. 4 కోట్ల రూపాయల నిధులు గల్లంతు అయ్యాయని సమాచారం అందుతోంది. కార్వాన్ ఎస్ బి ఐ లో గిడ్డంగుల శాఖ కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ నిధులు మాయం అయినట్లు సమాచారం అందుతోంది.

తప్పుడు ఎఫ్‌ డీ పత్రాలు చూపి union babk కార్వాన్ శాఖ నుండి ఈ ఎఫ్‌ డీలు కొల్లగొట్టారు ఆగంతకులు. తెలుగు అకాడెమీ తరహాలోనే నిధులు కాజేసిన కేటుగాళ్లు… అదే ముఠా ఈ పని చేసిందని అనుమానిస్తున్నారు పోలీసులు. అంతేకాదు.. బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సిసిఎస్ లో గిడ్డంగుల శాఖా అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు..ఈ దర్యాప్తును వేగ వంతం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news