ఆడుకుంటూ ఆడుకుంటూ పప్పులో పడి చచ్చిపోయింది…!

-

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. వండిన వంటలో పడి ఒక పాప ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నగరానికి గంట దూరంలో రాంపూర్ అటారీ గ్రామంలో ఒక చిన్న పాప ఆడుకుంటూ, ఆడుకుంటూ వెళ్లి అప్పుడే అక్కడ వండి పెట్టిన ఆహారాన్ని ఆ పాప గుర్తించలేదు. దీనితో నడుస్తూ నడుస్తూ వెళ్లి అందులో పడిపోయింది. దీనితో తీవ్ర గాయాలు అయ్యాయి.

ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్ళగా గాయాలతో ప్రాణాలు విడిచింది. అయితే ఆ పాప స్కూల్ కి చెందినది కాదని అధికారులు చెప్పారు. దీనితో అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు కూడా కాసేపు ఏమీ అర్ధం కాలేదు. ఇయర్‌ఫోన్‌లు ఉన్నందున వంటవారు ఆమెను కంటైనర్‌లో గమనించలేదని ఆమె తండ్రి పేర్కొన్నారు. ఎం జరిగిందో గ్రహించిన తర్వాత వాళ్ళు భయపడిపోయారని బాలిక తండ్రి మీడియాకు వివరించారు.

దీనితో ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేస్తామని జిల్లా మేజిస్ట్రేట్ సుశీల్ కుమార్ పటేల్ సోమవారం తెలిపారు. ప్రాథమిక విద్యాశాఖాధికారి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని కోరారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యొక్క నివేదికను దర్యాప్తు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే అక్కడ ఉన్న వారు ఆ పాపను కావాలనే ఆ వంట పాత్రలోకి తోసివేసారని కొందరు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news