తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ.. రూ.2 లక్షలు దోచుకెళ్లిన దొంగ

-

తిరుమల లడ్డూ కౌంటర్లో దొంగతనం జరిగింది. ఓ దుండగుడు కౌంటర్‌లో ఉన్న రూ.2 లక్షలు దోచుకెళ్లాడు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాస్‌ పవన్‌ కార్పొరేషన్‌ ద్వారా తిరుమల లడ్డూ కాంప్లెక్సులో నెలక్రితం రాజా కిషోర్‌ కౌంటర్‌ బాయ్‌గా విధుల్లో చేరారు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో విధులు నిర్వహించారు. లడ్డూల విక్రయం ద్వారా వసూలైన రూ.2 లక్షలను తనవద్దే ఉంచుకుని, గడియ పెట్టడం మరిచిపోయి కౌంటర్లోనే నిద్రపోయారు.

ఉదయం నిద్రలేచి చూడగా నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పాత నేరస్థుడైన సీతాపతిని గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డూ కాంప్లెక్సుకు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news