గత ప్రభుత్వంలో వైద్య రంగంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయి:మంత్రి సత్యకుమార్

-

గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం జరిగిందని మంత్రి సత్యకుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అన్ని మంత్రిత్వ శాఖలు ఈ ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని ఆయన అన్నారు.

 

శనివారం యనమలకుదురులో వెలగపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన ఆరోగ్య మందిర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైద్య రంగంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని.. వీటిపై విచారణ చేసి త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని.. ప్రభుత్వం ముందు చర్యలు తీసుకుందని తెలిపారు.అక్కడక్కడా కొన్ని చోట్ల అతిసారం ప్రబలింది. ఎన్నికల నేపథ్యంలో అక్కడ దృష్టి సారించలేదని తెలిసిందని.. ఇక నుంచి ఇతర శాఖల సమన్వయంతో పని చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news