దొంగ తెలివి : య‌జ‌మానురాలు క‌ళ్లు పోగొట్టి.. ఆ పై చోరీ

-

తాను ప‌ని చేస్తున్న ఇంట్లో దొంగత‌నం చేయ‌డానికి.. య‌జ‌మానురాలి క‌ళ్లనే పోగొట్టింది. ఈ దారుణమైన ఘ‌ట‌న హైద‌రాబాద్ లోని నాచారంలో చోటు చేసుకుంది. కాగ నాచారంలో హేమావ‌తి అనే వృద్ధురాలు ఓంటరిగా నివాసం ఉంటుంది. కాగ ఆమె కుమారుడు శ‌శిధ‌ర్ లండ‌న్ లో ఉద్యోగం చేస్తాడు. అయితే హేమావ‌తిని చూసుకోవ‌డానికి కేర్ టేక‌ర్ గా భార్గ‌విని ఉంచాడు. భార్గ‌వి.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మహిళ‌. భార్గ‌వికి ఇప్ప‌టికే వివాహం జ‌ర‌గ‌గా.. భ‌ర్త‌ను విడిచిపెట్టి ఉంటుంది.

arrested
arrested

ఇదీలా ఉండ‌గా.. భార్గ‌వి తాను ప‌ని చేస్తున్న ఇంట్లో చోరీ చేయాల‌ని ప్లాన్ వేసింది. ఈ క్ర‌మంలో ఒక సారి హేమావ‌తికి క‌ళ్ల స‌మ‌స్య రావ‌డంతో కంటికి సంబంధించి చికిత్స జ‌రిగింది. ఇదే అదునుగా భావించి.. చికిత్స త‌ర్వాత క‌ళ్ల కు అందించాల్సిన మందుకు బ‌దులు జెండు బాంబు తో పాటు ఇత‌ర ర‌సాయ‌న‌ల‌ను అందించింది. దీంతో హేమావ‌తి కంటి చూపు పూర్తిగా పోయింది. దీంతో భార్గ‌వి ఆ ఇంట్లో నుంచి 6 తులాల బంగారంతో పాటు రూ. 40,000 న‌గ‌దును చోరీ చేసింది.

కాగ కంటి చూపు పోవ‌డంపై హేమావ‌తి కుమారుడు ఆస్ప‌త్రికి వెళ్ల‌గా.. క‌ళ్ల పై విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని వైద్యులు చెప్పారు. దీంతో కేర్ టేక‌ర్ భార్గ‌విపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో అసలు నిజం బ‌య‌ట ప‌డింది. దీంతో పోలీసులు భార్గ‌విని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news