ఆర్థిక సంక్షోభంలో ఈ బ్యాంక్.. కస్టమర్ల పరిస్థితేంటి..!

-

చాల మంది డబ్బులను బ్యాంకులో దాచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణాలను చుస్తే.. ప్రజల్లో కూడా బ్యాంకుపై విశ్వాసం తగ్గుతుంది అని చెప్పవచ్చు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకువస్తూ కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. అయితే ఇప్పుడు మరో బ్యాంక్ దివాలా అంచున కొట్టుమిట్టాడుతోందన్నారు. అదే ప్రైవేట్ రంగ లక్ష్మీ విలాస్ బ్యాంక్. ఈ బ్యాంక్ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని తెలిపారు. అంతేందుకు ఈ బ్యాంకు అమ్మకానికి కూడా సిద్ధంగా ఉందని జాతీయ మీడియా వెల్లడించింది.

bank-customer
bank-customer

అయితే సంక్షోభంలో ఉన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను క్లిక్స్ గ్రూప్ కొనుగోలు చేయనుందని నివేదికలు వెలువడుతున్నాయని చెప్పారు. ఇక లక్ష్మీ విలాస్ బ్యాంక్‌కు ఇప్పటికే క్లిక్స్ గ్రూప్ నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చిందని తెలిపారు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఈ విషయాన్ని తెలియజేసిందని అన్నారు. ఈ అంశంపై రెండు వర్గాల మధ్య చర్చలు జరగనున్నాయని కూడా నిపుణులు తెలిపారు.

ఇక క్లిక్స్ గ్రూప్ కొనుగోలు ప్రతిపాదన నేపథ్యంలో లక్ష్మీ విలాస్ బ్యాంక్ త్వరలోనే రికవరీ బాట పట్టే ఛాన్స్ ఉందని బ్యాంకింగ్ నిపుణులు అన్నారు. కాగా లక్ష్మీ విలాస్ బ్యాంక్‌కు ఇప్పటికిప్పుడు రూ.2,500 కోట్ల మూలధనం అవసరం ఉందన్నారు. ఇందులో రూ.500-రూ.700 కోట్లు కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించుకోనుందని తెలిపారు.

అయితే టైర్ 1 క్యాపిటల్ నెగటివ్‌లోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం లక్ష్మీ విలాస్ బ్యాంక్ ప్రస్తుతం గోల్డ్ లోన్స్ మాత్రమే అందిస్తోందన్నారు. అలాగే ప్రభుత్వ గ్యారంటీ ఉన్న ఎంఎస్ఎంఈ లోన్స్ మాత్రమే ఆఫర్ చేస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ మాత్రం తన కస్టమర్లకు భరోసా ఇస్తోందని తెలిపారు. డిపాజిట్ దారులకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. అభద్రతాభావానికి లోనవద్దని, మీ డబ్బులు సురక్షితంగానే ఉన్నాయని చెబుతోంది. ఇటీవల బ్యాంక్ మేనేజ్‌మెంట్ కూడా మారింది. దీంతో బ్యాంక్ మరో బ్యాంక్‌లో విలీనమయ్యే అవకాశం కూడా ఉందని నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news