డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాకపోవడమే రొమాంటిక్ సినిమాకి మైనస్ అయిందా ..?

-

డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చింది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అన్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా కి ముందు పూరి వరస ఫ్లాపుల తో ఉండటం తో సినిమా చేయడానికి హీరోలెవరు ఆసక్తి చూపించలేదు. అయినా రాం పోతినేని దొరకడం తో ఈ సినిమా తెరకెక్కించి పూరి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎవరూ ఊహించని విధమగా ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు పూరి. అలాగే తన కొడుకు ఆకాష్ పూరి తో రొమాంటిక్ అన్న సినిమాని నిర్మిస్తున్నాడు.

 

అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు సినిమాలు ఆగిపోయాయి. విజయ్ దేవరకొండ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని పూరి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటింస్తుంది. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య పాండే ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. కాని ఆ రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. అయినా అనన్య కి మాత్రం గ్లామర్స్ క్వీన్ గా మంచి పేరు వచ్చింది. ఇక ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా పూరి కొడుకు ఆకాష్ సినిమా రొమాంటిక్ సినిమా మీద ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా పూరికి కాస్త ఇబ్బందులు అవుతాయన్న మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఈ రొమాంటిక్ సినిమాని సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా పరిస్థితులు అన్ని మారిపోయాయి. ఒకవేళ లాక్ డౌన్ తర్వాత రిలీజ్ చేసినా సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని టాక్ నడుస్తుంది. అందుకు కారణం కటి ఆకాష్ కి హీరోగా ఇమేజ్ లేకపోడం మరోక కారణం ఈ సినిమా డైరెక్టర్ కాకపోవడం. ఇదే రొమాంటిక్ సినిమాకి చాలా మైనస్ అయ్యో అవకాశాలున్నాయని అంటున్నారు. మరి చూడాలి ఏం జరగనుందో.

Read more RELATED
Recommended to you

Latest news