ఖైరతాబాద్ మహా గణపతి నిర్మాణం ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేశుడు శ్రీ విశ్వశాంతి మహా శక్తిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 71వ సంవత్సరం సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని 69 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు. మహాగణపతికి కుడివైపున శ్రీ జగన్నాథ స్వామి, శ్రీలక్ష్మి సమేత హయగ్రీవ స్వామి దర్శనమిస్తే, ఎడమవైపున లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి కొలువై ఉన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నమూనాని ఆలయ సభ్యులు విడుదల చేశారు.

ఇప్పటినుంచి మహాగణపతి నిర్మాణ పనులను ప్రారంభిస్తే పండగ లోపు పనులు పూర్తవుతాయని ఆలయ సభ్యులు వెల్లడించారు. కాగా, ఖైరతాబాద్ గణపతిని చాలామంది భక్తులు దర్శించుకుంటారు. ఖైరతాబాద్ గణపతిని చూడడానికి లక్షలాది సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకొని దర్శనం చేసుకొని వెళ్తారు. దర్శన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు నీటి సదుపాయం, భోజన సదుపాయాన్ని ఏర్పరుస్తారు.