కొండాపూర్ డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసులో ముగ్గురు అరెస్ట్

-

కొండాపూర్ డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. స్నార్ట్ పబ్ యజమాని, మేనేజర్ తో పాటు డ్రైవ్ చేసిన అభిషేక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ పబ్ లో మద్యం సరఫరా చేసినందుకు గాను కేసు నమోదు చేశారు పోలీసులు. అటు ఆశిత్ మృతికి కారణమైన అభిషేక్ ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. మద్యం మత్తులో విపరీతమైన వేగంతో డ్రైవ్ చేసి ఆశిత్ మరణానికి అభిషేక్ కారణమయ్యాడని పోలీసులు విచారణలో గుర్తించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు ఈ మేరకు అరెస్ట్ చేశారు. పబ్ తో పాటు అభిషేక్ పైన 304 పార్టీ b-section కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై డిసిపి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. కొండాపూర్ కేసులో ముగ్గురి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. కారు నడిపిన అభిషేక్ తో పాటు స్నార్ట్ పబ్‌ యజమాని, మేనేజర్ లను అరెస్టు చేశామని.. కారులో ఉన్న సత్యప్రకాష్, తరుణిలు ఇంకా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్నారు. తరుణి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడ్డాక వాళ్ళ పైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news