టీఆర్‌ఎస్‌ షాక్.. బీజేపీ గూటికి తుక్కుగూడా మున్సిపల్ చైర్మన్ !

-

టీఆర్‌ఎస్‌ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగలనుంది. బీజేపీ గూటికి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడా మున్సిపల్ చైర్మన్ మదన్ మోహన్.. వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. తాజాగా ఢీల్లీకి వెళ్లిన చైర్మన్ మదన్ మోహన్… ఈ రోజు కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా గెలిచిన మదన్ మోహన్… టిఆర్ఎస్ లో చేరి మున్సిపల్ చైర్మన్ పోస్ట్ దక్కించుకున్నాడు.

టిఆర్ఎస్ పార్టీ ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా నాయిని నర్సింహారెడ్డి,కేశవరావు, సబితా ఇంద్రారెడ్డి కాటేపల్లి జనార్దన్ రెడ్డి ఎగేమల్లేశం… ఐదుగురు ఎక్స్ అఫీషియల్ సభ్యుల సహకారంతో స్వతంత్ర అభ్యర్థి మధుమోహన్ ని.. టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.

అయితే… మదన్ మోహన్ పై కౌన్సిలర్ గా ఓడిపోయిన వ్యక్తిని టిఆర్ఎస్ తుక్కుగూడా మున్సిపల్ అధ్యక్షునిగా నియమించింది టీఆర్‌ఎస్‌ పార్టీ. దీంతో అసంతృప్తికి గురయ్యాడు మదన్ మోహన్. అంతేకాదు.. ఇటీవల మున్సిపల్ మంత్రి కేటీఆర్ తుక్కుగూడా పర్యటనకు దూరంగా ఉన్నారు మదన్ మోహన్. ఈ నేపథ్యంలోనే బీజేపీ మదన్‌ సంప్రదింపులు చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version