నల్లమల ఆటవీప్రాంతంలో పులికి మత్తుమందు ఇచ్చి బంధించిన అటవీ సిబ్బంది..!

-

ఆత్మకూరు పరిధిలో నల్లమల ఆటవీ ప్రాంతంలో పులికి మత్తుమందు ఇచ్చి అటవీ సిబ్బంది బంధించింది. పులికి వేటగాళ్ళు వేసిన ఉచ్చును తొలగించి అటవీ సిబ్బంది కాపాడింది.
పులికి ఎలాంటి హాని లేదని, ఆరోగ్యంగానే ఉందని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. మరిన్ని వివరాలను చూస్తే..

కొద్ది రోజుల క్రితం ముసలిమడుగు బీట్ లో వేటగాళ్ల ఉచ్చులో పెద్దపులి పడింది. అయితే ఆ ఉచ్చును పెకిలించి ఉచ్చు తో సహా అడవిలో తిరుగుతూ గత నెల 25న ట్రాప్ కెమెరాకు పెద్ద పులి చిక్కింది. 10 రోజులు గా మహారాష్ట్ర, ఏపీ కి చెందిన ఫారెస్ట్ సిబ్బంది 50 మంది సిబ్బంది అడవి లో గాలించి ఉచ్చు తో తిరుగుతున్న పెద్దపులి ని గుర్తించి కాపాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version